సొంత రాష్ట్రంలో అన్యాయాలు జరిగితే స్పందించరా? ఇదెక్కడి న్యాయం? : శేజల్‌

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు, ఆరిజిన్ డైరీ సీఈవో శేజల్, పక్క రాష్ట్రంలో అన్యాయం జరిగితే స్పందిస్తారా.. సొంత రాష్ట్రంలో అన్యాయాలు జరిగితే స్పందించరా? ఇదెక్కడి న్యాయం? అంటూ ప్రశ్నించారు. ఈ నేపధ్యం లో, శేజల్ ఈరోజు ఒక వీడియో విడుదల చేశారు. ఇటీవల మణిపూర్ లో ఇద్దరు మహిళలను లైంగికంగా వేధించి.. నగ్నంగా ఊరేగించారని, అయితే ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు ఆమె. వారికి న్యాయం జరగాలని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు, మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారని, చాలా మంచి పని చేశారని పేర్కొన్నారు.

Sejal Sensational Allegations Against BRS MLA Durgam Chinnaiah, Details  Inside - Sakshi

‘‘మరి పక్క రాష్ట్రంలో అన్యాయం జరిగితే క్షణాల్లో స్పందించిన మీరంతా.. మీ సొంత రాష్ట్రంలో.. మీ సొంత పార్టీ ఎమ్మెల్యే నన్ను లైంగికంగా వేధించాడు. ఈ వ్యవహారంపై నేను ఆరు నెలలుగా విశ్రాంతి లేకుండా పోరాడుతూనే ఉన్నా. ఏ ఒక్కరూ కూడా నాకు న్యాయం చేస్తామని ముందుకు రావడం లేదు’’ అని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తపరిచారు. మరి తనకు జరిగిన అన్యాయం కనిపించలేదా? వినిపించలేదా? అని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను అడిగారు శేజల్‌.

Read more RELATED
Recommended to you

Latest news