రాజమండ్రి రూరల్ సీటు పై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు..!

-

టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడంతో రాజమండ్రి రూరల్ సీటు హాట్ గా మారింది. ఈ స్థానం నుండి టీడీపీ జనసేన ఆశావహులు ఇద్దరు పోటీకి సై అంటున్నారు. టిడిపి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ బుచ్చయ్య చౌదరి పోటీకి రెడీ అవుతున్నారు. జనసేన నుండి కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ సీట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు.

రాజమండ్రి రూరల్ సీటు పై టిడిపి అధినేత మాజీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ఈ సీటు విషయంలో అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. టికెట్ ఆశిస్తున్న ఇద్దరు ఆసవాహలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని బుచ్చయ్య చౌదరి కందుల దుర్గేష్ చెరో చోట బరిలో ఉంటారని అన్నారు. ఒకరు రాజమండ్రి రూరల్ మరొకరు వేరేచోట నుండి పోటీ చేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు ఈరోజు వచ్చిన లిస్టులో రాజమండ్రి రూరల్ అభ్యర్థిని ప్రకటించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news