చంద్రబాబు అరెస్ట్ ను సీఎం కేసీఆర్ ఖండించాలి: మాజీ మంత్రి మోత్కుపల్లి

-

చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో రిమాండ్ లో దాదాపుగా మూడు వారాల నుండి ఉంటున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు అరెస్ట్ పైన చాలా మంది నేతలు స్పందించారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం స్పందించింది లేదు. ఇందుకు కారణం ఏమైనా ఉంటుందా అంటూ పలువురు ఈ విషయం పట్ల సందేహించారు కూడా.. ఇక తాజాగా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు స్పందించారు. ఈయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ అక్రమంగా జరిగిందని, ఇందుకు నిరసనగా కేవలం రేపు ఒక్కరోజు హైద్రాబాద్ లో నిరసన దీక్షను చేపడుతున్నట్లు మోత్కుపల్లి ప్రకటించారు. ఇంకా మోత్కుపల్లి మాట్లాడుతూ ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేను స్పందిస్తున్నా కానీ చంద్రబాబు కాబినెట్ లో మంత్రిగా చేసిన కేసీఆర్ మాత్రం ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదంటూ మోత్కుపల్లి మాట్లాడారు.

కేసీఆర్ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తే ప్రజాస్వామ్య వాదిగా మంచి పేరు వస్తుందంటూ సలహా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news