విశాఖ డ్రగ్స్ కేసు: ఆ MLA పై చంద్రబాబు సంచలన కామెంట్స్..!

-

విశాఖ లో 25 వేల కిలోల డ్రగ్స్ ని అధికారులు పట్టుకున్న విషయం మనకి తెలిసిందే. డ్రగ్స్ రవాణా వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. డ్రగ్స్ రవాణా వెనుక వైసిపి నేతలు ఉన్నారని టిడిపి ఆరోపిస్తోంది. వైసిపి కూడా టిడిపి నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది ఇది ఇలా ఉంటే అటు టిడిపి అధినేత చంద్రబాబు కూడా డ్రగ్స్ రవాణా వెనుక కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని అంటున్నారు.

ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి ఢిల్లీ లిక్కర్స్ కి ఎంతో సంబంధం ఉందని అంటున్నారు దీనిపై కూడా సిబిఐ తేల్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 25 వేల కిలోల డ్రై ఈస్ట్ పేరుతో జర్మనీ నుండి కంటైనర్ లో విశాఖపట్నంకి డ్రగ్స్ తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు. సిబిఐ వస్తే పోలీసులు జాప్యం చేసే ప్రయత్నం చేశారని అన్నారు సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఒకసారి కూడా రివ్యూ చేయలేదని వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news