ఈ అక్రమాల మీద వెంటనే విచారణ జరపాలి: చంద్రబాబు

-

ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్షల్లో అక్రమాల మీద సిబిఐ విచారణ చేయాలని TDP అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఉద్యోగం సాధించాలని ఎన్నో ఆశలతో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకి అన్యాయం జరిగితే సహించేది లేదని చెప్పారు చంద్రబాబు. రాజకీయ అబద్ధమైన ఏపీపీఎస్సీ ని కూడా రాజకీయలబ్ది కోసం చేసారని ఫైర్ అయ్యారు.


వైసీపీ పాలనలో నిరుద్యోగులకి అన్యాయం జరిగిందని చెప్పారు తమ వాళ్ళని పోస్టింగ్ లో కూర్చో పెట్టేందుకు అర్హులైన వాళ్లకి పోస్టింగ్ ఇవ్వలేదని అన్నారు సర్వీస్ కమిషన్ అక్రమాల్లో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని అన్నారు. ఐపీఎస్లు సీతారామాంజనేయులు గౌతమ్ మీద కేసు నమోదు చేయాలని అన్నారు లక్షల మంది విద్యార్థులు ఏళ్ల తరబడి పడిన కష్టాన్ని అలానే వాళ్ళ ఆశయాలని వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందని అన్నారు చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version