ఢిల్లీకి వెళుతున్న చంద్ర‌బాబు

-

*శనివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మీడియా స‌మావేశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ‌నివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంపై కేంద్రం కుట్రలను ఢిల్లీ వేదికగా విన్పించేందుకు ఆయన హస్తినకు పయనంకానున్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి, ఆపరేషన్‌ గరుడ తదితర అంశాలను సీఎం దేశ ప్రజల ముందు ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచేయి చూపడం, తిత్లీ తుఫానుపై స్పందించకపోవడం, విభజన చట్టం పెండింగ్ అంశాలపై డిల్లీ వేదికగా ఎత్తిచూపాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మరోవైపు, గవర్నర్ వ్యవస్థను కేంద్రం వాడుకుంటోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ అవ‌స‌రం లేద‌న్న డిమాండును కూడా చంద్ర‌బాబు లేవ‌నెత్తుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news