చంద్రబాబుకు తలలో చిప్ లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి

-

వచ్చేనెల మే 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు పై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.టీడీపీ అధినేత చంద్రబాబుకు తలలో చిప్ లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు నాయుడు పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 2014-19 మధ్యలో బాబు విశ్వరూపాన్ని ప్రజలు చూశారు అని అన్నారు. మేనిఫెస్టో అంటే ఓ బాండ్ లాంటిది. కానీ దానిని చంద్రబాబు చిత్తుకాగితంతో సమానంగా చూస్తున్నారు అని మండిపడ్డారు. మేం మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా చూస్తున్నాం. గత మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేశాం’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news