వాయిదా పడిన చంద్రబాబు ఆస్తుల కేసు విచారణ.. ఎందుకంటే..?

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ వాయిదా పడింది. హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానంలో కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా వేశారు. వాస్త‌వానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ వైసీపీ నేత లక్ష్మీపార్వతి అప్పట్లో ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు 14 ఏళ్ల క్రితం దాఖలైంది. దీనిపై విచారణ ప్రారంభం కాక ముందే తన వాదనలు కూడా వినాలంటూ చంద్రబాబునాయుడు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు.

కానీ ఏసీబీ కోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించడంతో ఆయన హైకోర్టుకు వెళ్లగా, అక్కడ స్టే లభించింది. ఈ స్టేను ఎత్తివేయాలంటూ నాడు లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ వాయిదా పడింది. ఈ కేసులో లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాల్సి ఉండగా, తన తరఫున సీనియర్ న్యాయవాది హాజరవుతారంటూ లక్ష్మీపార్వతి కోర్టుకు విన్నవించుకున్నారు. అప్పటివరకు విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news