రాజధాని ఉద్యమం కోసం జోలె పట్టిన చంద్ర‌బాబు..

-

ఏపీ రాజధాని ఉద్యమం మరోస్థాయికి చేరింది. అమరావతి పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రజా చైత్యనయాత్ర చేపట్టిన విష‌యం తెలిసిందే. గురువారం విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు యాత్ర చేపట్టారు. దారి పొడవునా చంద్రబాబుకు ప్రజలు రోడ్డుపైకి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. పోరంకి, తడిగడప, పెనమలూరులో ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జోలె పట్టారు.

మచిలీపట్నంలో ఆయన జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలను సేకరించారు. అమరావతి పరిరక్షణ కోసం ప్రజల నుంచి విరాళాలను సేకరించారు. ఓ కండువా పట్టుకుని ప్రజల వద్దకు వెళ్లిన చంద్రబాబుకు ప్రజలు, వ్యాపారులు తమకు తోచినంత డబ్బులను ఆ జోలెలో వేశారు. కాగా, ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజానీకం పాల్గొంది. మహిళలు, యువత రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ముక్తకంఠంతో నినదించారు.

Read more RELATED
Recommended to you

Latest news