ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై చంద్రబాబు ఆందోళన..!

-

కరోనా మహమ్మారి ప్రభావం సినీ రంగంపై తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు దీని బారిన పడగా.. తాజాగా ప్రముఖ లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆయన చెన్నైలోని ఓ కార్పోరేట్ హాస్పిటల్‌లో కోవిడ్‌కు చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో నిన్న రాత్రి ఐసీయూకి తరలించారు. కాగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్షిణించడం పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు.

కరోనా చికిత్స పొందుతున్న ఎస్పీ బాలు గారిని ఐసీయూకి తరలించారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఎస్పీ బాలు కరోనా నుంచి కోలుకుని, క్షేమంగా బయటికి రావాలని భగవంతుడ్ని మనసారా ప్రార్థిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version