ఏపీ డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు..!

-

గతకొన్ని రోజులుగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం తారస్థాయికి చేరినట్టు కనిపిస్తుంది. టీడీపీ నేతల వరుస అరెస్టులతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది, టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని అర్ధమవుతుంది. అయితే జరుగుతున్న సంఘటనలకు నిరసనగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌‌కు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుస అరాచకాలు చేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు. దళితులపై దాడులు- దౌర్జన్యాలు, టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు, అరెస్ట్‌ లపై మండిపడ్డారు. పోలీసు, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి లని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version