వై-నాట్ పులివెందుల స్ఫూర్తితో జగన్‌ను ఓడిస్తా – చంద్రబాబు

-

వై-నాట్ పులివెందుల స్ఫూర్తితో జగన్‌ను ఓడిస్తానని టి.డి.పి.అధినేత చంద్రబాబు తెలిపారు. మీరు పని చేసే పని.. పని విధానం అంతా స్పష్టంగా తెలుస్తుంది..మీ పని తీరు నా సెల్ ఫోన్ కు వస్తుందన్నారు. కష్టపడి పని చేసిన వారిని ఎవరినీ మరచిపోను..25 సంవత్సరాల క్రితమే టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ విప్లవం తీసుకొచ్చామని వివరించారు.

టెలిగ్రామ్ బాట్ యాప్ ద్వారా 22 లక్షల మంది సభ్యులుగా చేరారు..రాష్ట్ర, జిల్లా, మండలాల నుండి క్షేత్ర స్థాయిలో పార్టీని తీసుకెళ్లేందుకు కొత్త విధానాలను తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలతో మమేకం కాలేని కారణంతో మన్మోహన్ సింగ్ లాంటి నేత సైతం గెలవలేకపోయాడు..ఈ జగన్ బిడ్డ …బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ అంటూ నిప్పులు చెరిగారు చంద్రబాబు. 2 లక్షల.56 వేల టిడ్కో ఇళ్లు కట్టిస్తే ..నాలుగేళ్లయినా ఇంత వరకూ ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు. కరోనా టైంలో వాడి ఇప్పుడు బూత్ బంగ్లాలు గా చేసాడు..మూడు పట్టభద్రుల స్థానాలు గెలిచామన్నారు. అందుకే అంటున్నా…వై నాట్ పులివెందుల అంటున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version