తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం వస్తుంది: చంద్రబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన సంధర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని ఆధ్వర్యంలో చంద్రబాబుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పాలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డి, బక్కిన నరసింహులు, అర్వింద్ కుమార్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో లేకపోయినా తెలంగాణలో కార్యకర్తల ఉత్సాహం చూస్తే ముచ్చటేస్తోందన్నారు. ఎన్టీఆర్, పీవీ నరసింహారావు దేశానికి దశ, దిశను చూపించారని, టీడీపీ వచ్చాకే తెలుగు వారి ప్రతిభ ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ అని చెబుతున్నారని, దానికి టీడీపీ వేసిన పునాది కారణమన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ప్రతి అడుగులో టీడీపీ ముద్ర ఉందన్నారు. అలాగే తెలుగు వాళ్లు ప్రపంచం నలుమూలలా ఉండటానికీ టీడీపీయే కారణమని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version