కుప్పం గుడిపల్లిలో రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన మూడవరోజు ఉత్కంఠ రేపుతోంది. కుప్పంలోని గుడిపల్లి లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు చంద్రబాబు. గుడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి చంద్రబాబు చైతన్య రథాన్ని వేరే ప్రాంతానికి తరలించారు. దీంతో చంద్రబాబు రోడ్డుపై బైఠాయించి నేతలతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దిగజారిన రాజకీయానికి చరిత్రలో జగన్ ఒక పర్యాయపదం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ పాలన ఎమర్జెన్సీని తలపించేలా ఉందని మండిపడ్డారు. జీవో నెంబర్ 1 పై పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాహితం కోసమే తాను పోరాటం చేస్తున్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక చంద్రబాబుకు మద్దతుగా గుడిపల్లి పోలీస్ స్టేషన్ వద్దకి టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news