కృష్ణా జిల్లా టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

-

కృష్ణా జిల్లా టీడీపీ నేతలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతకాలంగా వారి తీరుపై అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు.. తాజాగా వారికి వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి ఉమ్మడి జిల్లా వ్యవహారాలు తానే సమీక్షిస్తానని చెప్పారు.

మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీపై వైసీపీ శ్రేణులు దాడి చేసినా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని టీడీపీ లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులు సరైన రీతిలో స్పందించలేదని పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాడి జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్లలేదని వారిని నిలదీశారని సమాచారం. భవిష్యత్తులో ఇలాగే వ్యవహరిస్తే ఊరుకోనని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

వివిధ సంఘటనల్లో జిల్లా నేతలు సరిగా స్పందించడం లేదనీ, నాయకుల మధ్య సమన్వయం కరవైందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగితే కలిసికట్టుగా ఎదుర్కోవాలని వారికి సూచించారు. పలువురు నాయకుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version