చంద్రబాబు జైలు భద్రతపై భువనేశ్వరి అనుమానం… !

-

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు తీవ్ర మనస్తాపంతో ఉన్నారని తెలిసిందే. చంద్రబాబు తరపున లాయర్లు అవినీతి చేయలేదని నిరూపించడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇక తాజాగా హౌస్ అరెస్ట్ ను చేయాలనీ చంద్రబాబు తర్పమున పిటిషన్ వేయగా దానిని ఏసీబీ కోర్ట్ కొట్టిపారేసింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమండ్రి సెంట్రల్ జైలు యొక్క భద్రతపై ఈమె తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. నా భర్త చంద్రబాబుకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని వాపోయారు. అంతే కాకుండా సెక్యూరిటీ పైన కూడా సందేహాలు ఉన్నాయని తెలియచేసింది. ఇక చంద్రబాబుకు ఇంత వయసులో కూడా చన్నీటి స్నానం చేయాల్సి వస్తోందని ఆమె బాధపడ్డారు. ఈ కారణాలనే చూపించి హౌస్ రిమాండ్ కు ఆవకాశం ఇవ్వాలని అడిగిన కోర్ట్ అంగీకరించలేదు.

మరి ముందు ముందు చంద్రబాబు కేసులో ఇంకేమి జరుగుతుందో చూడాలి. అయితే ఈ కేసులకు అదనంగా మరికొన్ని కేసులను జత చేయడానికి సిఐడి చూస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news