పూరి ఛార్మి మధ్య దూరం పెరిగిందా..!!

-

పూరి జగన్నాథ్ , విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన సినిమా లైగ‌ర్‌. విపరీత మైన ప్రచారంతో  పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున విడుదల అయ్యి ,బాక్స్ ఆఫీస్ వద్ద  సినిమా బోల్తా పడింది. దీంతో  ఈ  సినిమా త‌ర్వాత పూరి మరియు ఛార్మి ఇద్దరూ మీడియాకు చాలా రోజుల నుండి దూరంగా వుంటున్నారు. రీసెంట్‌గా చిరంజీవితో గాడ్ ఫాద‌ర్ లో పూరి నటించారు. ఈ సినిమా స‌క్సెస్ సంద‌ర్భంగా జ‌రిగిన లైవ్ వీడియో ఇంట‌ర్వ్యూలో పూరి మరియు చిరంజీవి పరస్పరం మాట్లాడుకున్నారు.

ఈ లైవ్ ప్రోగ్రాంలో చిరు సినిమా ఫ్లాప్‌ను ఎలా తీసుకుంటావు అని పూరిని అడగటం జరిగింది. ఈ ప్ర‌శ్న‌కు  సమధానంగా పూరి మాట్లాడుతూ ‘‘సక్సెస్ వస్తే ఫుల్ ఎనర్జీ వుంటుంది. అదే ఫెయిల్యూర్ వ‌స్తే మాత్రం ఉన్న ఎన‌ర్జీ మొత్తం పోతుంది అన్నారు. అలాగే ఏదైనా దెబ్బ త‌గిలిన‌ప్పుడు ఓ హీలింగ్ టైమ్ ఉంటుంది, ఆ టైమ్ త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. ఆస్తులు పోవ‌చ్చు, మానసికంగా దెబ్బ తినొచ్చు, అయితే ఎన్ని జ‌రిగినా చెత్త టైమ్ ఒకనెల కంటే ఎక్కువ‌గా ఉండ‌కూడ‌దు.లైగ‌ర్ సినిమా చేసే ప్రాసెస్‌లో నేను మైక్ టైస‌న్‌తో, విజయ్ వంటి వారితో షూటింగ్ మూడేళ్లు ఎంజాయ్ చేశాను. అయితే  ప్రస్తుతం ఫెయిల్యూర్ వ‌చ్చింది. అది మ‌న చేతిలో లేదు. దానికి చాలా రోజులు ఏడుస్తూ కూర్చోలేము కదా ’’ అన్నారు. అలాగే స‌క్సెస్ వ‌చ్చిన‌ప్పుడు అందరికీ మనం జీనియ‌స్‌లాగా క‌నిపిస్తాం. అదే ఫెయిల్ అయితే వాళ్ళు మనల్ని ఫూల్‌లా చూస్తారు.సినిమాకు ప‌ని చేసిన‌వాళ్లు, న‌మ్మినోళ్లు కూడా రివ‌ర్స్ అవుతారు అని అనడం జరిగింది.

దీనితో ఆ రివర్స్ అయిన వాళ్ళు ఎవరు అని ప్రశ్నలు మొదలు అయ్యాయి. వాస్తవానికి ఈ ప్లాప్ తర్వాత పూరి,ఛార్మి కలసి కనపడలేదు.కాని ఛార్మి పై బయ్యర్స్ బాగా ఒత్తిడి తెస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో పూరీ జగన్నాథ్ అస్సలు పట్టించుకోవడం లేదని గుస గుసలు వినిపిస్తున్నాయి. విజయ్ మాత్రం 6 కోట్లు ఛార్మికి ఇచ్చినట్లు మీడియాలో తెలిసింది. ప్రస్తుతం పూరీ మాత్రం ఒక్కడే హోటల్లో కూర్చొని నెక్ట్స్ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ తయారు చేసుకుంటున్నాడని, దీనితో పూరీ, ఛార్మి మధ్య దూరం పెరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news