ఇన్‌స్టాలో వేరే వ్యక్తితో చాటింగ్.. అడ్డంగా బుక్కైన వివాహిత..ఏం చేసిందంటే?

-

కొందరు అపరిచితులతో పెళ్లయిన మహిళలు చేస్తున్న సరదా చాటింగ్ వారి మెడకు ఉరితాడులా బిగుసుకుంటోంది. పచ్చని కాపురంలో ఈ కొత్త పరిచయాలు నిప్పులు పోస్తున్నాయి. తాజాగా ఓ వివాహిత ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం అయిన వ్యక్తి చేసిన మోసానికి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనానికి తెరలేపింది.తూర్పుగోదావరి జిల్లా చక్రద్వారబంధం గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ వ్యక్తి చేసిన మోసం కారణంగా ప్రాణాలు తీసుకుంది.

వివరాల్లోకివెళితే.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ఆ వివాహిత పలుమార్లు చాటింగ్ చేసింది. చాలా క్లోజ్ అయ్యారు. దీంతో ఆమెకు మాయమాటలు చెప్పిన ఆ వ్యక్తి వివాహిత నుంచి బంగారు నగలు, రూ.4 లక్షల నగదు తీసుకుని జంప్ అయ్యాడు. ఈ విషయం అత్తారింట్లో తెలిసి నగలు, డబ్బుల గురించి ప్రశ్నించడంతో గొడవలయ్యాయి. దీంతో ఆ వివాహిత పుట్టింటికి వచ్చి ఉరేసుకుని మృతి చెందింది. ఆ వివాహితకు ఒక పాప ఉన్నట్లు సమాచారం. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version