శాంతి పూజల పేరుతో 18లక్షలకు టోపీ.. మహబూబా జిల్లాలో ఘరానా మోసం

-

దేవుడి పేరుతో జరుగుతున్న మోసాలకు అంతే లేకుండా పోతుంది. భక్తి అన్న నమ్మకంతో ఉన్న వారిని దేవుడి పేరు చెప్పి అనేక రకాలుగా మోసాలు చేస్తున్నారు. ముఖ్యంగా శాంతి పూజల నెపంతో లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. తాజాగా జరిగిన సంఘటన అలాంటిదే. మహబూబా బాద్ జిల్లాలోని రజాక్ అనే వ్యక్తి, టీవీలో వచ్చిన ప్రకటనలు చూసి, నమ్మి శాంతి పూజల కోసం డబ్బు ఖర్చు పెట్టాడు. మీకెలాంటి సమస్యలు ఉన్నా పూజలతో నయం అవుతుందన్న మాటలు నమ్మిన రజాక్, ఫోన్ సంభాషణలో తన ఇంటి సమస్యలన్నీ చెప్పుకు వచ్చాడు.

ఆ తర్వాత దీనికి శాంతి పూజలు చేయాలంటూ అప్పుడప్పుడూ డబ్బు పంపమన్నారు. ఇలా ఏకంగా 18లక్షలు వసూలు చేసారు. తీరా చూస్తే ఇదంతా మోసం అని తేలింది. దేవుడి పేరుతో తనని మోసం చేసారని రజాక్ వాపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవుడి పేరు చెప్పి, నీకు అది తక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉందని చెప్పే గుర్తు తెలియని వారి మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news