ఈ నీలం టీ తో గుండె, మెదడు సమస్యలకి చెక్..!

-

చాలా మంది అనారోగ్య సమస్యల తో బాధ పడుతూ ఉంటారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వలన చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఈ టీ ని తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఇక ఈ టీ గురించి ఎటువంటి సమస్యలు దూరం అవుతాయి అనే విషయాన్ని చూసేద్దాం. శంకు పుష్పాలు కేవలం పూజ కి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. శంకు పుష్పాలతో టీ చేసుకుని తాగితే రకరకాల సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు.

ఈ టీ ని తీసుకోవడం వలన యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉండటంతో పలు రకాల సమస్యలు దూరం అవుతాయి. ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి కూడా. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలని దెబ్బ తీసే హానికరమైన ఫ్రీ రాడికల్స్ తొలగి పోతాయి ఈ టీ తో. ఖాళీ కడుపుతో వారానికి ఒకటి రెండు సార్లు ఈ కప్పు ఈ టీ ని తీసుకుంటే చక్కటి లాభాలని పొందొచ్చు. ఎసిడిటీ, మలబద్దకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి బాధలు ఉండవు.

ఈ టీ ని తీసుకోవడం వలన బరువు తగ్గడానికి కూడా అవుతుంది. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు కూడా ఈ టీ తీసుకోవచ్చు హృదయ సంబంధిత సమస్యలకి కూడా దూరంగా ఉండొచ్చు శంకు పుష్పాలతో తయారు చేసిన టీ ని తీసుకోవడం వలన కళ్ళకి కూడా మంచిది. మెదడు కూడా బాగా పని చేస్తుంది. మెదడుకి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇలా సింపుల్ గా ఈ ఒక్క టీ తో ఇన్ని సమస్యల్ని సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news