ఛీ.. ఛీ.. బాలిక శీలానికి వెలకట్టారు..!

-

సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. ఓ 15 ఏళ్ల బాలికను ఓ యువకుడు మాయమాటలు చెప్పి ఎక్కడెక్కడికో తీసుకెళ్లి.. తిరిగి తీసుకువచ్చి వదలి వెళ్లాడు. దీంతో బాలిక జీవితాన్ని అన్యాయం చేశాడని బంధువులు పోలీస్‌ స్టేషన్‌ కి వెళ్లడంతో ఓ పార్టీ నేత రూ.30వేలు ఇప్పిస్తామంటూ బాలిక శీలానికి వెలకట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

women
women

బాధితుల కథనం మేరకు.. శివాజీనగర్ ‌లో తల్లిదండ్రులు లేని 15 ఏళ్ల బాలికను అదే ప్రాంతానికి చెందిన హరీష్‌ (30) ఎటో తీసుకెళ్లిపోయాడు. దీంతో 20వ తేదీన ఆ బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హరీష్‌ ఆ బాలికను కొన్నిరోజుల పాటు ఎక్కడెక్కడో తిప్పి మదనపల్లె బస్టాండు వద్ద వదలి వెళ్లిపోయాడు. ఇంటికి చేరిన బాలిక జరిగిన విషయాల గురించి చెప్పడంతో అనంతరం ఆ బాలిక బంధువులు టూటౌన్‌ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాలికను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లి జీవితాన్ని నాశనం చేశాడని, న్యాయం చేయాలని కోరారు. బాలికను పోలీసులు తహశీల్దార్‌ ఎదుట బుధవారం హాజరుపరిచారు.

ఈ విషయం తెలుసుకున్న హరీష్‌ మిత్రుడు, రాజీ‘బేరం’ కుదిర్చిన నేత సోదరుడు.. మరికొందరితో కలిసి బుధవారం రాత్రి బాధితుల ఇంటిపై రాళ్లతో దాడి చేసి చితకబాదారు. దీంతో ఈ దాడిలో గాయపడిన వారు గురువారం టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను కిడ్నాప్‌ చేసి ఐదు రోజుల పాటు సోమలలో ఉన్నారని, దీనిపై స్థానిక నాయకుడొకరు పంచాయితీ చేసి, రాజీకి రాకుంటే ఇబ్బందులు తప్పవని బెదిరించడంతో స్టేషన్‌ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని వాపోయారు. వీరి గుట్టును బయట పెట్టినందుకు తమపై దాడి చేశారని, వీరి నుంచి ప్రాణహాని ఉందని, వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news