గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ..

-

గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఏపీ సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని కోసం బడ్జెట్‌లో ఒక వెయ్యి 150 కోట్లు కేటాయించారు. తొలి విడతలో 10 వేల రూపాయల లోపు డిపాజిట్లకు చెక్కులు పంపిణీ చేపట్టారు. రాష్ట్రంలో 3 లక్షల 69 వేల 655 మందికి 263.99 కోట్లు చెల్లించనున్నారు.

త్వరలో 20 వేల లోపు డిపాజిటర్లకు కూడా చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ క్ర‌మంలోనే అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని చెప్పామని, ఇప్పుడు ఇచ్చిన మాట నెరవేర్చుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news