విమాన విధ్వంసక‌ క్షిపణులను ప్రయోగించిన చైనా

-

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో చైనా, అమెరికా మ‌ధ్య కొంత‌కాలంగా మాట‌ల‌యుద్ధం న‌డుస్తోంది. ఇటీవ‌ల‌ అమెరికా గూఢచార విమానాలు వివాదాస్పద భూభాగంలో తిరుగుతున్నాయని చైనా ఆరోపించింది. ఈ క్ర‌మంలో అమెరికాకు హెచ్చ‌రిక‌గా డ్రాగ‌న్ కంట్రీ మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. చైనా నావికా విన్యాసాల్లో భాగంగా మొదటిసారిగా రెండు విమాన విధ్వంసక మిసైళ్ల‌ని దక్షిణ చైనా సముద్రంపైన ప్రయోగించడం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. ఈ రెండు మిస్సైళ్లు 4 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలవు.

దక్షిణ, తూర్పు చైనా సముద్ర ప్రాంతాల్లో ఉన్న వివాదాన్ని దృష్టిలో ఉంచుకొని, చైనా ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను బలోపేతం చేసుకుంటోంది. అయితే.. దక్షిణ చైనా సముద్రంపై తమకే పూర్తి అధికారాలున్నాయని చైనా అంటోంది. కానీ.. వియత్నాం, మలేషియా, పిలిప్‌పైన్స్, బ్రూనే, తైవాన్‌లు చైనాతో విభేదిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version