ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి నష్టం :మాజీ ఎంపీ చింతా మోహన్

-

మాజీ ఎంపీ చింతా మోహన్ కేంద్రం పై ఏపీ సర్కార్ పై విమర్శలు కురిపించారు. దేశం చాలా దారుణమైన పరిస్థితులలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చైనా భారత భూభాగంలోకి కొన్ని కిలోమీటర్ల మేర చొచ్చుకొని వచ్చి శాశ్వత కట్టడాలు నిర్మించారని ఆరోపించారు. రాష్ర్టంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని చింతా మోహన్ అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన లేదని….మద్యం, గంజాయి వంటి మాదకద్రవ్యాలు విచ్చల విడిగా అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

దేశ అభివృద్ధి లో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని….ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి నష్టం జరుగుతుందని అన్నారు. రాష్ట ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు సమయానికి అందించలేక పోతోందని ఆరోపించారు. రాష్టం లో 80 లక్షల మంది విద్యార్థుల కు స్కాలర్ షిప్ లు, మెస్ చార్జిలు నిలిచి పోయాయని చెప్పారు. సంక్రాంతి పండుగ లోపు వారికి బిల్లులు చెల్లించాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని చింతామోహన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news