రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ నే నమ్మిన చిరంజీవి…!

-

రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. కథ నచ్చితే చాలు చిరంజీవి సినిమా చేయడానికి వెనుకాడే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో యువ హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.

ఇదిలా ఉంటే ఆయన ఈ సినిమా తర్వాత మలయాళం రీమేక్ సినిమా… లూసిఫర్ లో నటించే అవకాశం ఉంది. అయితే ఈ కథను తెలుగులో ఎవరు రెడీ చేస్తారు అనేది స్పష్టత లేదు. యువ దర్శకులు బాబీ, అనీల్ రావిపూడి కి చిరంజీవి ఆ బాధ్యతలు అప్పగించారు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వారిని కాదని, మరో సీనియర్ దర్శకుడికి చిరంజీవి అవకాశం ఇచ్చారు. తనతో ఖైదీ నెంబర్ 150 చేసిన వీవీ వినాయక్ కి దర్శకత్వం చేసే ఛాన్స్ ఇచ్చారు.

2021 సమ్మర్‌లో విడుదల కానుంది ఆచార్య సినిమా. తన ఇమేజ్‌కు సరిపోయేలా తెలుగులో ఈ కథను మార్చడానికి సరైన దర్శకుడి కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి ఆ అవకాశాన్ని… వీవి వినాయక్ కి ఇచ్చారు. తనకు ఠాగూర్, ఖైదీ నెం 150 లాంటి సినిమాలు చేసిన వినాయక్ అయితే ఈ సినిమాను బాగా తెరకేక్కిస్తారు అని భావించి అవకాశం ఇచ్చారట. ఇప్పుడు ఆ కథను రెడీ చేస్తున్నాడు వినాయక్.

Read more RELATED
Recommended to you

Latest news