శివ శంక‌ర్ మాస్ట‌ర్ మృతి పై స్పందించిన చిరంజీవి

-

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శివ శంక‌ర్ మాస్ట‌ర్ క‌రోనా కార‌ణంగా ఆది వారం రాత్రి చ‌నిపోయాడు. అయితే ఆయ‌న మృతి ప‌ట్ల టాలీవుడ్ మెగా స్టార్ చింర‌జీవి సంతాపం ప్ర‌క‌టించాడు. ఆయ‌న మృతి చెందిన వార్త త‌న ను క‌లిచి వేసింద‌ని చిరంజీవి అన్నారు. ఆయ‌న మృతి సినీ ప‌రిశ్ర‌మ కు తీరని లోటు అని తెలిపారు. శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు త‌న మ‌ధ్య మంచి స్నేహం ఉంద‌ని గుర్తు చేశారు. త‌న తో స్నేహం ఖైదీ సినిమా నుంచి మొద‌లైంద‌ని గుర్తు చేశారు.

అలాగే త‌ర్వాత కూడా చాలా సినిమా ల‌కు క‌లిసి చేశామ‌ని అన్నారు. కాగ రామ్ చ‌ర‌ణ్ మ‌గ‌ధీర సినిమా లో ధీర ధీర పాట‌కు శివ శంకర్ మాస్ట‌ర్ కొరియోగ్రాఫర్ గా చేశాడు. దీనికి శివ శంకర్ మాస్ట‌ర్ కు జాతీయ అవార్డు ద‌క్కింద‌ని గుర్తు చేశారు. అలాగే శివ శంక‌ర్ మాస్ట‌ర్ ను చివ‌రి సారి గా ఆచార్య సినిమా సెట్ లో క‌లిసాన‌ని తెలిపారు. కానీ ఆ మీటింగే చివ‌రి సారి అవుతుంద‌ని అనుకోలేద‌ని చిరంజీవి అన్నాడు. కాగ శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు క‌రోనా చికిత్స కోసం రూ. 3 ల‌క్ష ల‌ను చిరంజీవి అంద‌జేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news