ఆ పబ్లిసిటీ మాకు అవసరం లేదంటున్న చిరంజీవి..!

-

తాజాగా చిరంజీవి హీరోగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య… ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక చాలా ఘనంగా నిర్వహించగా.. ప్రస్తుతం చిరంజీవి తన సినిమా ప్రమోషన్స్ నిమిత్తం మీడియా ఛానళ్లకు వరుసగా ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి చేసిన కొన్ని కామెంట్లు పరోక్షంగా బాలకృష్ణను ఉద్దేశించి చేసినట్లుగా ఉన్నాయని వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.

అసలు విషయం ఏమిటంటే… తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతున్న సమయంలో అల్లు అర్జున్ , రామ్ చరణ్ ప్రస్తావన వచ్చింది.. ఇదే విషయంపై ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ ఎందుకు మెగాస్టార్ అయిన మీ పేరు, మీ ఫ్యామిలీ గురించి ఎక్కడ మాట్లాడడం లేదు.. చరణ్ కూడా ఎక్కువగా మీ ప్రస్థానం తేవడం లేదు ఏంటని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ అనగానే… దానికి మెగాస్టార్ స్పందించారు.ప్రతిచోట నా ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు. మాట్లాడితే మా నాన్నగారు.. మా నాన్నగారు అని నేను.. పది సార్లు చెప్పుకొని… చరణ్ బాబు మా నాన్నగారు.. మా నాన్న చిరంజీవి అదని , ఇదని.. మా నాన్న ఎంతో గొప్ప వాళ్ళు అని. చెప్పుకుంటే వినే వాళ్ళకి చాలా బోర్ కొడుతుంది.. ఆ పబ్లిసిటీ మాకు అవసరం లేదు అని చిరంజీవి తెలిపారు.

అయితే ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు బాలకృష్ణను ఉద్దేశించి మాట్లాడినవే అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మరోపక్క వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మెగాస్టార్ చిరంజీవి.. శృతిహాసన్ రాకపోవడానికి గల కారణాలు ఏమిటో? ఒంగోలులో ఏం జరిగిందో? తెలియదు అంటూనే ఆమెను ఎవరైనా బెదిరించారేమో అంటూ సెటైర్లు వేశారు. మొత్తానికి అయితే చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news