ఈనాడు రామోజీరావు ఒక లెజెండ్: మెగాస్టార్ చిరంజీవి

-

కరోనా నేపథ్యంలో షూటింగ్‌లు నిలిచిపోవడంతో.. సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) మనకోసం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు అందించారు. తాజాగా ఈనాడు అధినేత రామోజీరావు కూడా సీసీసీకి తనవంతు సాయంత అందించేందుకు మందుకొచ్చారు. సినీ కార్మికులను ఆదుకునేందుకు రూ. 10 లక్షల విరాళం అందజేశారు.

ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. అలాగే రోజువారి వేతనానికి పనిచేసే సినీ కార్మికులను ఆదుకునేందకు సాయం అందించినందుకు థాంక్యూ చెప్పారు. “సీసీసీకి రామోజీరావు గారు రూ. 10 లక్షలు అందజేశారు. మీ ఉదారతకు, ముఖ్యంగా సినీ కార్మికుల కోసం సహాయం అందించినందుకు మీకు ధన్యవాదాలు. ఈ పరిశ్రమకు మీరు అందించిన సేవలు అసాధారణమైనవి. మీరు ఒక లెజెండ్ సార్” అని చిరంజీవి పేర్కొన్నారు.

కరోనా పోరాడుతున్న తెలుగు రాష్ట్రాలకు కూడా రామోజీరావు భారీ విరాళం అందజేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. 10 కోట్ల చొప్పను విరాళం ఇచ్చారు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ మొత్తాన్ని ఆన్‌లైన్ ద్వారా ఇరు రాష్ట్రాల సీఎంఆర్ఎఫ్ అకౌంట్లకు బదిలీ చేసినట్టు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news