ఖాకీ సినిమాని తలపించిన ఏపీ పోలీసులు.. సెల్ ఫోన్ కంటైనర్ల దొంగల అరెస్ట్

-

హైవేలపై వెళ్తున్న కంటైనర్లకు కన్నం వేసి… ఖరీదైన ఫోన్లను కొట్టేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు పట్టు కున్నారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన కంజర్ భట్ ముఠా ఆట కట్టించి… దోచుకున్న ఫోన్లను మొత్తం స్వాధీనం చేసుకున్నారు.

ఇటీవల నగరి వద్ద తమిళనాడు నుంచి ముంబయి వెళుతున్న కంటైనర్‌ను దారి మళ్లించి.. 7 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను కంజర్‌భట్‌ ముఠా ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత శ్రీ సిటీ నుంచి కోల్‌కతాకు వెళుతున్న కంటైనర్ నుంచి 80 లక్షల విలువైన సెల్ ఫోన్లను గుంటూరు వద్ద కొట్టేశారు. చిత్తూరు జిల్లా పోలీసులు నెల రోజులుగా దేవాస్ లోనే మకాం వేసి ముఠాను పట్టుకున్నారు. అది కూడా మామూలుగా కాదు కార్తీ హీరోగా ఖాకీకి సినిమాకి ఏమాత్రం తగ్గకుండా కూలీలుగా కష్టాలు పడుతూ ఎట్టకేలకి వారిని పట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news