టీవీ ప్రేక్షకులకు శుభవార్త.. గడువు పెంచారు..!

-

ఈనెల 29 తర్వాత ఏ చానెల్ చూడాలనుకుంటే ఆ చానెల్ కు డబ్బులు కట్టి చెల్లించుకోవాలని ట్రాయ్ కొత్త రూల్స్ పెట్టిందని చదువుకున్నాం. టీవీల్లోనూ వాటికి సంబంధించిన యాడ్స్, మీకు ఈటీవీ ప్యాక్ కావాలంటే ఇంత, జెమినీ ప్యాక్ కావాలంటే అంత, జీ ప్యాక్ కావాలంటే ఇంత చెల్లించాలంటూ చూస్తున్నాం కదా. అయితే.. దాని గడువు ఈనెల 29 వరకు కాదు.. వచ్చే నెల అంటే జనవరి 31 వరకు.

జనవరి 31 వరకు గడువు పొడిగిస్తున్నట్టు ట్రాయ్ ప్రకటించింది. ట్రాయ్ అధికారులు డీటీహెచ్ ఆపరేటర్లు, ఎంఎస్ వోలు, ప్రసార సంస్థలతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వినిపిస్తోంది. ఇది కేబుల్ ఆపరేటర్లకు, టీవీ ప్రేక్షకుడికి బారం అని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news