నీలా మాట్లాడటం ఎవరి వల్లా కాదు సామి..!

-

రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం సాయంత్రం యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగింది. మెగాస్టార్ చిరంజీవితో పాటుగా, కె.టి.ఆర్ ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఇక ఈ సందర్భంగా మెగా హీరోలతో మంచి అనుబంధం ఉన్న త్రివిక్రం చిరంజీవి, చరణ్ లపై తన అభిప్రాయాన్ని చెప్పాడు.

అందరు మాట్లాడారు కాని త్రివిక్రం మాటలు వేరుగా ఉంటాయి. త్రివిక్రంలా మాట్లాడటం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.. అందరికి నమస్కారం అంటూ మొదలు పెట్టి ముందు సినిమా టైటిల్ గురించి ప్రస్థావించి.. ఆ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను కమర్షియల్ సినిమాల్లో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తీయడం గురించి మెచ్చుకుని ఇక చిరంజీవి సినిమాల ప్రస్థానం ఆయన వేసిన పూల దారి గురించి మాట్లాడాడు త్రివిక్రం.

చరణ్ రంగస్థలం చూశాక చరణ్, సుకుమార్ ఇద్దరికి ఫోన్ చేసి మాట్లాడా కాని ఆ సినిమా గురించి మాట్లాడే సందర్భం ఎక్కడా రాలేదు. కొన్ని సినిమాలు హిట్ అవుతాయి కొన్ని సినిమాలు సంతృప్తిని ఇస్తాయి. అలా రెండు వచ్చేలా చేసిన సినిమా రంగస్థలం. ఇక వినయ విధేయ రామ కూడా అదే రేంజ్ లో ఉంటుందని ఆన్నారు త్రివిక్రం.

ఇక త్రివిక్రం మాట్లాడిన మాటలను రాయడం కన్నా ఆయన మాటల్లోనే వింటే బెటరేమో.. వినయ విధేయ రామ త్రివిక్రం స్పీచ్ మీరు ఓ లుక్కేయండి..

Read more RELATED
Recommended to you

Latest news