పోలీసులు, గోరంట్ల మాధవ్ మధ్య వాగ్వివాదం

-

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ ఆలయ విరాళాల అంశం పై తాజాగా  వివాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా వైసీపీ నాయకులు అమ్మవారి సొమ్మును కాజేసారని టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే  తాము ఎలాంటి తప్పు చేయలేదని నిరూపిస్తానన్నారు వైసీపీ నేత గోరంట్ల మాధవ్.

ముత్యాలమ్మ  ఆలయం వద్దకు వచ్చేందుకు బయలుదేరినటువంటి గోరంట్ల మాధవ్ ను మరూరు టోల్ గేట్ వద్ద  పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా అస్సలు రాకూడదని చెప్పారు పోలీసులు. దీంతో పోలీసులు, గోరంట్ల మాధవ్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆయనకు నోటీసులను అందజేసి వెనక్కి పంపించారు పోలీసులు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version