తెలంగాణ సత్తా రేపు చూపిస్తా.. కౌశిక్ రెడ్డి సవాల్..!

-

బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అరికెపూడి గాంధీకి పీఏసీ కమిటీ చైర్మన్ పదవీని కట్టబెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపత్యంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నేతల మధ్య తొలుత మాటల యుద్ధం జరిగింది. ఆ తరువాత కౌశిక్ రెడ్డి రంగంలోకి దిగారు.  గురువారం ఉదయం 11 గంటలకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి వెళ్లి అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని సవాల్ చేశారు. దానికి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా ప్రతి సవాల్ చేశారు.

తాజాగా అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుట గాంధీ, అనుచరులు ధర్నాకు దిగారు. అనంతరం కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో తన్నుకోవడమే పరిష్కారం అంటే.. గాంధీ ఒక్కడూ వస్తే తాను సిద్ధమేనని చెప్పారు. గాంధీ 60 ఏళ్ల వృద్ధుడు అని.. తాను 39 ఏళ్ల యువకుడినని  పేర్కొన్నారు. తాను తెలంగాణ గడ్డ మీద పుట్టిన వ్యక్తినని.. నీలా నాన్ లోకల్ కాదని.. తెలంగాణ సత్తా ఏంటో రేపు చూపిస్తానని సంచలన సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version