బద్వేల్ బాధిత కుటుంబానికి సీఎం చంద్రబాబు ఫోన్.. రూ.10లక్షల ఆర్థికసాయం!

-

ఏపీలో ఇంటర్ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన కడప జిల్లా బద్వేల్‌లో జరిగింది. ఈ క్రమంలోనే బాధితురాలి తల్లితో సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

అందుకోసం విచారణ వేగవంతం చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు.అంతేకాకుండా, బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాలిక సోదరుడి చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. బాలిక తల్లికి ఉపాధి కల్పించేలా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news