ఏపీ పోలీసులతో సీఎం చంద్రబాబు అత్యవసర భేటీ !

-

ఏపీ పోలీసులతో సీఎం చంద్రబాబు అత్యవసర భేటీ అయ్యారు. డీజీపీ, సీఎస్ సహా వివిధ దర్యాప్తు సంస్థల అధినేతలతో సీఎం సమీక్ష నిర్వహించారు. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, విజిలెన్స్ చీఫ్ హరీష్ కుమార్ గుప్త…ఈ సమీక్షలో పాల్గొన్నారు. మద్యం, గనులు, ఫైబర్ నెట్, భూ కబ్జాలు, మదనపల్లె ఫైల్స్ వంటి వాటిల్లో దర్యాప్తు పురోగతిపై చర్చ జరుగుతోంది.


ఇప్పటికే ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేశామని తెలిపారు సీఐడీ అధికారులు. మద్యం, ఫైబర్ నెట్ భూ కబ్జాల కేసుల్లో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఆరా తీసిన సీఎం చంద్రబాబు…ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అవినీతి వ్యవహారంపై విచారణపై సమీక్షలో ప్రస్తావన తెచ్చారు. మదనపల్లెలో తగులబడిన ఫైళ్లు ఘటన దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని చర్చ జరిగిందట. దర్యాప్తు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దర్యాప్తు సంస్థల అధినేతలతో సీఎం చంద్రబాబు భేటీ….కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version