లడ్డూ కల్తీ కేసు CBI కి ఇవ్వాలి : షర్మిలా

-

తిరుమల లడ్డూ కల్తీపై ఇవ్వాళ సుప్రీం కోర్టు చేసిన సూచన. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిది అని వైఎస్ షర్మిలా అన్నారు. కేంద్రం దర్యాప్తు చేయాలని, CBI తో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందునుంచే వాదిస్తోంది. ఇవ్వాళ సుప్రీం ఇచ్చిన సూచన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కి బలం చేకూరినట్లయ్యింది. సిట్ దర్యాప్తు రబ్బర్ స్టాంప్ తప్పా.. విచారణకు ఉపయోగం లేదు. CBI కి అప్పగిస్తేనే లడ్డూ కల్తీపై లోతైన దర్యాప్తు జరుగుతుంది. ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు వెల్లడవుతాయి.

కల్తీ ఎలా జరిగింది ? ఎక్కడ జరిగింది ? పాల్పడ్డ దొంగలు ఎవరు ? తక్కువ ధరకు కాంట్రాక్టు ఇవ్వడం వెనుక కారణం ఏంటి ? NDDB రిపోర్ట్ ను ఎందుకు ఇంతకాలం దాచిపెట్టారు ? మత రాజకీయాలకు ఆజ్యం పోసింది ఎవరు.. ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది. కూటమి సర్కారును మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. దెబ్బతిన్న హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం అనుకుంటే..మత రాజకీయాలు మీ అజెండా కాకపోతే.. లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అని వైఎస్ షర్మిలా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version