నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారు : చెన్నూర్ ఎమ్మెల్యే

-

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వివిధ శాఖల నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయడంతో రాష్ట్రం లోని ఖజానా ఖాళీ అయిందని చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు .మంచిర్యాల జిల్లా మందమర్రి ఎంపీడీఓ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదిముభారక్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ నల్లాల ఓదెలు,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు ప్రజా పాలన అందిస్తూ నిధులను సమకూర్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. సింగరేణి సంస్థలో కొత్త గనులను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారని వెల్లడించారు. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news