ఈ వార్తను నేను ఎలా మిస్ అయ్యాను : ఆనంద్ మహీంద్రా

-

పారిశ్రామిక దిగ్గజం ‘ఆనంద్ మహీంద్రా’ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు . అయితే ఆయన తాజాగా ఓ వీడియో షేర్ చేస్తూ ఇలాంటి ఉత్తేజకరమైన వార్తను నేను ఎలా మిస్ అయ్యాను అంటూ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.ఆయన షేర్ చేసిన వీడియో మార్చిలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించినది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వంటమనిషిగా పనిచేస్తున్న అజయ్ కుమార్ కుమార్తె ప్రజ్ఙను.. భారత ప్రధాన న్యాయమూర్తి, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశంసల వర్షం కురిపిస్తూ ఎంతగానో కొనియాడారు.ఈ సందర్భంగా ప్రజ్ఞ తల్లితండ్రులను జస్టిస్ చంద్రచూడ్ సన్మానించారు.

 

ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ.. భారత్ ఎందుకు పుంజుకుంటుంది అని ఎవరైనా నన్ను అడిగితే, నేను ఈ వీడియోను షేర్ చేస్తాను అని పేర్కొన్నారు. ఇది నిబద్దత, కృషి, తల్లిదండ్రుల మద్దతుకు నిదర్శనం. యునైటెడ్ స్టేట్స్‌లోని రెండు వేర్వేరు విశ్వవిద్యాలయాలలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్ అధ్యయనం చేయడానికి స్కాలర్‌షిప్ సాధించినందుకు, ఒక వంట మనిషి కుమార్తెను అభినందించారు అని ఆయన ట్వీట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news