ఒక్కటైన షర్మిల, జగన్ : వైయస్సార్ కు నివాళులు

-

కడప : ఇడుపులపాయ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాల్లో సీఎం జగన్, షర్మిల ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సీఎం జగన్, షర్మిల ఇద్దరు కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించడం గమనార్హం. వైఎస్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసి.. సీఎం జగన్, షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.

సీఎం జగన్, షర్మిల ఇద్దరు కలవడం తో అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మరియు ఇటు వైసీపీ పార్టీ లోనూ నూతన కోలాహలం నెలకొంది. అన్న జగన్ కు రాఖీ కట్టని షర్మిల.. ఇవాలైన కలిసినందుకు అందరూ సంతోషిస్తున్నారు. ఇక వీరిద్దరి కలయిక తో.. వారి రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మొన్నటి వరకు గొడవ పడ్డ అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు కలవడం ఎంటనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news