ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం జగన్‌..మరో విజయం అంటూ !

-

ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం జగన్‌..మరో విజయం అంటూ ట్వీట్‌ చేశారు. హోలీ పండుగ నేపథ్యంలో సీఎం జగన్‌ ఈ పోస్ట్‌ పెట్టారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను….అందరికీ హోలీ శుభాకాంక్షలు అన్నారు సీఎం జగన్‌.

కాగా అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరిచి, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి కేరింతలతో ఆనందోత్సాహాల నడుమ రంగులతో జరుపుకునే ప్రకృతి పండుగ హోలీ అన్నారు.

హోలీ పండుగ భారతీయ సామాజిక సాంస్కృతిక జీవన ప్రత్యేకతను చాటుతుందని కేసీఆర్ అన్నారు.
వసంతాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తూ జరుపుకునే హోలీ పర్వదిన సందర్భంగా ఆ ప్రకృతీమాత ప్రజలందరినీ చల్లగా చూడాలని కేసీఆర్ ప్రార్థించారు.

Read more RELATED
Recommended to you

Latest news