రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌..షెడ్యూల్ ఇదే

-

రేపు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ వెళ్లనున్నారు. ఈ మేరకు సీఎం జగన్‌ షెడ్యూల్‌ ను సీఎం క్యాంపు కార్యాలయం ప్రకటించింది. ఈ ఢిల్లీ పర్యటనలో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు సీఎం జగన్‌. అలాగే… రేపు ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్‌ భేటీ కానున్నారు.

cm jagan

ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంవాలపై ప్రధాని మోడీతో సీఎం జగన్‌ చర్చించనున్నారు. అనంతరం కేంద్రమంత్రి అమిత్‌ షాను కూడా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కలిసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే… రేపు ఉదయం 6.30 కు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇక రేపు ఉదయం పది గంటల ప్రాంతంలో ఢిల్లీలోని 1- జనపథ్ కు చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమా వేశం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version