సీఎం జగన్ నిరుపేదల సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి – ఎమ్మెల్యే చెవిరెడ్డి

-

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో 24.09కోట్ల చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 20,595మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన మాటను జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటున్నారని అన్నారు.

మహిళలను ఆర్థికంగా ఆదుకుంటున్నారని తెలిపారు. నిరుపేదల సంక్షేమం కోసం పరితపించే వ్యక్తి జగన్ అంటూ కొనియాడారు ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న జగనన్నను వచ్చే ఎన్నికల్లోను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. రాజకీయ జన్మనిచ్చిన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు జన్మంతా రుణపడి ఉంటానన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పరీక్షలు రాస్తున్న 2,500 మంది విద్యార్థులకు ఉచితంగా పరీక్ష సామాగ్రిని అందజేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news