Breaking : నేడు కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..!

-

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు కడప పర్యటన నిమిత్తం రానున్న దృష్ట్యా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కడప విమానాశ్రయం నుంచి పెద్ద దర్గాకు చేరుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి కుమార్తె రిసెప్షన్​కు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 2000 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ జాగిలాలు, బాంబు స్క్వాడ్, మెటల్ డిటెక్టివ్ తదితర సిబ్బంది మొత్తం అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ఎస్పీ సూచించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు దర్గాలో ఏర్పాట్లను ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు.

అయితే.. ఉదయం 10.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం, 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11.40 – 12.10 వరకు కడప అమీన్‌ పీర్‌ దర్గాలో జరగనున్న పెద్ద ఉర్సు ఉత్సవాలలో పాల్గొంటారు. 12.25 – 12.45 కడప మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version