సీఎం జగన్: ఇది మీ ప్రభుత్వం… మీకెప్పుడూ అన్యాయం చేయదు !

-

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే అమరావతిలోని ముస్లిం ప్రజాప్రతినిధులు , మాత పెద్దలు మరియు ఆ వర్గాలని చెందిన మిగిలిన ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ముస్లిం వర్గాలు కేంద్రం తీసుకురానున్న ఉమ్మడి పౌర స్మృతి బిల్లు గురించి సందేహాలను అడగడం జరిగింది. ఈయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం మీది.. బడుగు, బలహీన మైనారిటీల కోసం ఏర్పడింది అని గుర్తుంచుకోండి అంటూ వారికి మద్దతుగా మాట్లాడారు జగన్. ఎవ్వరూ ఈ బిల్లు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి భరోసాను కల్పించారు. ఇప్పటి వరకు ఉమ్మడి పౌరస్మృతి బిల్లు గురించిన డ్రాఫ్ట్ రెడీ కాలేదన్నారు. కనీసం ఆ బిల్లు ఏమిటి ? నిబంధనలు ఏమిటి ? ఇలా చాలా అంశాలు అందులో పొందుపరచబడి ఉంటాయి. ఎవ్వరికీ ఈ విషయాలు తెలియదు.. కానీ దీనిని దేశ వ్యాప్తంగా హైలైట్ చేశారు.

అందుకు వివిధ రాష్ట్రాలలో ఉన్న ముస్లిం సోదరులు దేనిపై ఆందోళన చెందుతున్నారు అంటూ బిల్లు గురించిన వాస్తవికతను వారికి తెలియచేశారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news