బ్రేకింగ్‌ : మద్యపాన నిషేధంపై జ‌గ‌న్ మరో కీలక నిర్ణయం..!

-

గత ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అనే హామీని కూడా గుప్పించిన జగన్ అది ఒకే సారి సాధ్యం కాదని అర్ధమయ్యి ఐదేళ్లలో విడతలవారీగా మద్యపాన నిషేధం దిశగా సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌క్కా ప్లానింగ్‌తో నిబంధ‌న‌లు రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ క్ర‌మ‌లోనే మద్య నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్యను తగ్గించాలని సీఎం ఆదేశించారు. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి తీసుకురావాలన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని సీఎం చెప్పారు. బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరుకే మాత్రమే బార్లలో మద్యం అమ్మకాలు సాగించాలని స్పష్టం చేశారు. ఆ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news