టాలీవుడ్ పరిశ్రమపై సిఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

-

గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ, జగన్ సర్కార్ ల మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ల ధరలు పెంచాలని గత కొన్ని రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు డిమాండ్ చేస్తూ ఉంటే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడ తగ్గెలేదే అన్నట్టు ముందుకు వెళుతుంది. ఇలాంటి తరుణంలో తాజాగా చిత్ర పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పెద్దల పై పరోక్షంగా విమర్శలకు దిగారు సీఎం జగన్. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు లో వైయస్సార్ పెన్షన్ కానుక పెంపు ను జగన్ ఇవాళ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదవాడికి అందుబాటు రేటులో వినోదాన్ని అందించాలని.. సినిమా టికెట్ల ధరలు నిర్ణయిస్తే ఆ నిర్ణయంపై రకరకాలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు పేదల గురించి ఆలోచించే వాళ్లేనా అని నిలదీశారు. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే విమర్శలు చేస్తున్నారని ఇలాంటి విమర్శలు చేసే వారందరూ పేదలకు శత్రువు లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్. కొంతమంది తమ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కోర్టు కు వెళ్లడం కూడా తగదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version