కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ కి కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్

-

తిరుపతిలో జరిగిన కార్మికశాఖ మంత్రుల జాతీయ సదస్సును ఉద్దేశించి.. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో మాట్లాడారు సీఎం వైఎస్‌ జగన్‌. పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన, బలోపేతంలో ఈ సదస్సు ద్వారా చేసిన మేధోమధనం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక జాతీయ సదస్సుకి తిరుపతిని వేదికగా చేసిన కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ సదస్సుకి వచ్చిన అందరికీ తిరుమల బాలాజీ దీవెనలు ఉంటాయని భావిస్తున్నానన్నారు. గడిచిన రెండు రోజులుగా ఈ సదస్సులో చర్చించిన అంశాలు కార్మిక చట్టాల పటిష్టతకు మరింతగా ఉపయోగపడతాయని భావిస్తున్నానని అన్నారు సీఎం జగన్.

పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన, బలోపేతంలో ఈ సదస్సు ద్వారా చేసిన మేధోమధనం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో ఈ సదస్సు జరగడం ఆనందదాయకం.. అంతేకాక ఇది గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. సదస్సులో క్యాంపు కార్యాలయం నుంచి హాజరైన వారిలో చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీఎంవో అధికారులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version