రేపటి నుంచి మూడు రోజుల పాటు కడపలో సీఎం జగన్ పర్యటన

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా అయిన కడప లో పర్యటించనున్నారు. కడప జిల్లాలో ఏకంగా మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. 23వ తేదీన అంటే రేపు ఉదయం 11 గంటల సమయంలో గన్నవరం నుంచి ప్రొద్దుటూరు వెళ్లనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి… ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక రేపు సాయంత్రం ఇడుపులపాయ ఎస్టేట్ లో బస చేస్తారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

ఇక 24వ తేదీన ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించ నున్నారు. అనంతరం ఆదిత్య బిర్లా యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు సీఎం జగన్. ఇక 25వ తేదీన ఉదయం పులివెందుల సి ఎస్ ఐ… చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు సీఎం జగన్. సీఎం జగన్ తో పాటు ఆ రోజున వైఎస్ భారతి కూడా పాల్గొని ఛాన్స్ ఉంది. ఇక 25న సాయంత్రం తిరిగి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు సీఎం జగన్ వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news