ఎమ్మెల్సీ ఎన్నికలను సీఎం జగన్ ప్రెస్టేజ్ గా తీసుకున్నారు – బాలినేని

-

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను సీఎం జగన్ ప్రెస్టేజ్ గా తీసుకున్నారని అన్నారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. సీఎం జగన్ ఎన్నికల గురించి ప్రతిరోజూ ఫోన్లో తనతో మాట్లాడుతున్నారని.. కచ్చితంగా గెలవాలని చెబుతున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు శ్యాంప్రసాద్ రెడ్డి ,చంద్రశేఖర్ రెడ్డిలను భారీ మెజారిటీ తో గెలిపిద్దాంమని పిలుపునిచ్చారు బాలినేని. ఈ ఎన్నికని పార్టీ ప్రతిష్ఠాత్మకంగా బావిస్తోందన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో ప్రతిపక్షం నోరు మూయిద్దామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ బలమేంటో ఈ ఎన్నికలతో చూపిద్దాం అన్నారు. గెలుపు మనదే అనే నిర్లక్ష్యం వద్దని అన్నారు. పట్టభద్రులు ,ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకునేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీకి విధేయుడుగా ఉంటే ఏదో ఒక రోజు మంచి జరుగుతుందనేందుకు నిదర్శనం ఎమ్మెల్సీ మురళి యేనని తెలిపారు మాజీ మంత్రి బాలినేని.

Read more RELATED
Recommended to you

Latest news