BREAKING : సీఎం కేసీఆర్‌, నమస్తే తెలంగాణపై పోలీసు కేసు

-

సిద్దిపేట జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచారని గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో కేసీఆర్, నమస్తే తెలంగాణ, టీ న్యూస్ పై పిర్యాదు చేశారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి లు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయ దేశ ద్రోహుల కంటే ప్రమాద కరమైన వ్యక్తి కేసీఆర్ అని… ముఖ్యమంత్రి కేసీఆర్ పై,నమస్తే తెలంగాణ, టి న్యూస్ యాజమాన్యాలపై రాజ ద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్ మీద,యాజమాన్యాల మీద కఠినమైన చర్యలు తీసుకోపోతే న్యాయస్థానాల తలుపు తడుతామని.. కేసీఆర్ పై కేసునమోదు చేసి శిక్షించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు.

కేసీఆర్ బయటకు వచ్చి బహిరంగంగా భారత రాజ్యాంగానికి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని…. రాజ్యాంగం వల్ల ప్రయోజనం లేదని కేసీఆర్ మట్లాడిండో ఇది దేశ ద్రోహ చర్య అన్నారు. దేశ ద్రోహం కేసు పెట్టి తక్షణమే అరెస్ట్ చేయాలని.. ఎనిమిది సంవత్సరాల కాలంలో బీజేపీకి సంపూర్ణ సహకారం. అందించిన కేసీఆర్ ఇప్పుడు తిట్టడం అంటే చీకటి ఒప్పందాల్లో తేడా రావడమేనని చెప్పారు. దళితులంటే కేసీఆర్ కి వివక్ష అని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news